కొలంబో: ఇండియాతో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది శ్రీలంక. ఈ మ్యాచ్లో టీమిండియా తరఫున ఇద్దరు ప్లేయర్స్ వన్డే అరంగేట్రం చేస్తున్నారు. టీ20ల్లో కలిసి ఇండియన్ టీమ్ తరఫున తొలి మ్యాచ్ ఆడిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్.. ఈ మ్యాచ్తో వన్డేల్లో అడుగుపెట్టనున్నారు. ఈ గ్రౌండ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం ఆనవాయితీ అని టాస్ సందర్భంగా శ్రీలంక కెప్టెన్ శనక చెప్పాడు. లంక టీమ్ తరఫున భనుక రాజపక్స అరంగేట్రం చేస్తున్నాడు.