కొలంబో: యువ ఆటగాళ్లు సత్తాచాటడంతో శ్రీలంకపై వన్డే సిరీస్ను సొంతం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్కు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం తొలి టీ20 జరుగనుంది. వన్డే సిరీస్ చేజిక్కించుకున్నాక ప్రయోగాలకు తెరలేపిన ధావన్ సేన.. పొట్టి సిరీస్లోనూ అదే ప్లాన్ అనుసరించనుంది. తొలి మ్యాచ్లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమే.