రామన్నపేట, జూలై12: సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతి పథకాన్ని ప్రజల సం క్షేమం కోసమే అమలు చేస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం ఆయన మండలంలోని ఇస్కిళ్ల గ్రామంలో డంపింగ్యార్డు, వైకుంఠధామం, కక్కిరేణి గ్రా మంలో పల్లెప్రకృతివనం, వైకుంఠధా మం, మండల కేంద్రంలో రూ. 16లక్షలతో ఆధునీకరించిన జిల్లా పరిషత్ విశ్రాంతి భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయని అన్నారు. పల్లెల్లో పచ్చదనం పెంపొందించాలని, నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని స్థానికులకు సూచించారు. ఇస్కిళ్ల గ్రామంలోని చెరువును మినీ ట్యాంక్బండ్గా అభివృద్ధి చేస్తానని, కక్కిరేణి గ్రామంలో వైకుంఠధామం వరకు సీసీ రోడ్డు, ఆసీఫ్నహర్ కాలువపై వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని ఆయన హామీఇచ్చారు.
పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు. మం డల కేంద్రంలో సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. మూడు లక్షల చెక్కులను ఆరుగురు లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు. కక్కిరేణిలో ఇటీవల అప్పుల బాధ తో ఆత్మహత్య చేసుకున్న మత్స్యగిరి కుటుంబ సభ్యులకు రూ. 10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, జడ్పీటీసీ పున్న లక్ష్మీజగన్మోహన్, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, తహసీల్దార్ ఆంజనేయులు, పీఆర్ఏఈ గాలయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ కన్నెబోయిన అయిలయ్య, సర్పంచ్లు పిట్ట కృష్ణారెడ్డి, బందెల యాదయ్య, గుత్తా నర్సిరెడ్డి, రేఖాయాదయ్య, కోళ్ల స్వామి, మెట్టు మహేందర్రెడ్డి, ఉప్పుప్రకాశ్, ఎంపీటీసీలు గొరిగే నర్సింహ్మ, ఎండి రేహాన్, తిమ్మాపురం మహేందర్రెడ్డి, గాదే పారిజాత, ఆమేర్, మండల కార్యదర్శి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సాయికుమార్, రాములు, ఉదయ్రెడ్డి, సుధాకర్యాదవ్, ముప్పిడి దయాకర్, మందడి శ్రీధర్రెడ్డి, కట్ట నరేందర్, నర్ర విజయ్ పాల్గొన్నారు.