మొయినాబాద్, మార్చి17: ప్రజల భద్రత కోసమే అదనపు పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేస్తు న్నట్టు ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్, ఏసీపీ సంజయ్కుమార్ తెలిపారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కొత్త పెట్రోలింగ్ వాహనాలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు మరింత భద్రత కల్పించాలనే ఆలోచనతో కొత్త పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులోనికి తీసుకొస్తున్నామన్నారు. రోడ్డు ప్రమా దాలు జరి గినా, గొడవలు జరిగినా నిమిషాల్లో పెట్రోలింగ్ వాహనాలు అక్కడికి చేరుకుంటున్నాయని తెలిపా రు. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల కోసం ఎంతో కృషి చేస్తుందన్నారు. కార్యక్రమం లో సీఐ రాజు, ట్రాఫిక్ రిజర్వుడ్ సీఐ లవకుమార్రెడ్డి, ఎస్ఐలు జగదీశ్వర్, నారాయణసింగ్, ఏఎస్ఐలు శ్రీశైలం, గోపాల్, వీర్బాల్రెడ్డి పాల్గొన్నారు.