ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్లో మిగిలిపోయిన మ్యాచ్లను ఈ ఏడాదిలోనే నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలతో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్లో ఇక ఐపీఎల్ను నిర్వహించడం కష్టమే. ఐపీఎల్లో మిగతా 31 మ్యాచ్లను నిర్వహించేందుకు పలు దేశాల క్రికెట్ బోర్డులు ముందుకొస్తున్నాయి.
తాజాగా ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు.. బీసీసీఐకి తెలిపింది. లీగ్ను పూర్తి చేసేందుకు బీసీసీఐకి సహకారం అందిస్తామని లంక పేర్కొంది. టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ రూపొందించడానికి బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. టీ20 వరల్డ్కప్నకు ముందు సెప్టెంబర్లో మిగిలిన 31 మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చేందుకు
లంక ఆసక్తి చూపిస్తోంది.