శ్రీనగర్: అమర్నాథ్ యాత్రకు అడ్వాన్స్ రిజిస్ట్రేషన్లు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. గుర్తించబడిన బ్యాంకు శాఖల్లో ఆఫ్-లైన్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి భక్తులు ఉత్సాహం చూపుతున్నారు. తొలిరోజు చాలా మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్కు చెందిన 316 శాఖలు, జమ్ముకశ్మీర్ బ్యాంక్ 90, యెస్ బ్యాంక్ 40 శాఖలతో పాటు మరో మూడు బ్యాంకులు కలుపుకుని మొత్తం 446 శాఖల నుంచి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అమర్నాథ్ యాత్ర ప్రయాణం జూన్ 28 వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. 56 రోజుల పాటు కొనసాగే ఈ యాత్ర ఆగస్టు 22 తో ముగుస్తుంది.
ఈ యాత్రను నిర్వహించే శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్రం వెబ్సైట్లో రిజిస్టర్డ్ బ్యాంకులు, వాటి శాఖల పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. తద్వారా భక్తులు ఎలాంటి సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. జమ్ముకశ్మీర్లోని దోడాలో ఒకటి, జమ్ములో ఐదు, కతువాలో రెండు, పూంచ్, రాంబన్, రాజౌరి, రియాసి, సాంబా, శ్రీనగర్, ఉదంపూర్, లేహ్లో ఒకటి చొప్పున బ్యాంకులలో కూడా రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. జమ్ము జిల్లాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అఖ్నూర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెహారీ బీసీ రోడ్, జమ్ముకశ్మీర్ బ్యాంక్ బక్షినగర్, జమ్ముకశ్మీర్ బ్యాంక్ గాంధీనగర్, జమ్ముకశ్మీర్ బ్యాంక్ టీఆర్సీ ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర పాలిత ప్రభుత్వాలు అధీకృత వైద్యులు, వైద్య సంస్థల నుంచి తీసుకునన ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయని అమర్నాథ్ యాత్ర బోర్డ్ ఇప్పటికే స్పష్టం చేసింది. మార్చి 15 తర్వాత జారీ చేసిన ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు మాత్రమే చెల్లుతాయి.
13 ఏండ్లలోపు, 75 ఏండ్లు పైబడిన భక్తులు అమర్నాథ్ యాత్రకు అనుమతించడంలేదు. బాల్తాల్, చందన్వాడి వద్ద ఉన్న ద్వారాలు వద్ద ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పర్మిట్లను వివిధ రంగుల్లో ముద్రిస్తున్నారు. అమర్నాథ్ యాత్రకు ఈసారి ఆరు లక్షల మంది భక్తులు వస్తారని నిర్మాహకులు భావిస్తున్నారు.
అమర్నాథ్ యాత్రకు పేర్లు నమోదు చేసుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్సాహం చూపుతున్నారు. రియారీ బీసీ రోడ్డు బ్రాంచ్లో తొలి రిజిస్ట్రేషన్ నమోదైంది. జమ్ముకు చెందిన రాజేంద్ర కుమార్ అనే యాత్రికుడు తన పేరును రిజిస్టర్ చేయించుకుని ఈసారి యాత్రకు తొలి భక్తుడిగా నిలిచారు. బాల్తాల్ గుండా ప్రయాణించడానికి రాజేంద్ర కుమార్ తన పేరును నమోదు చేసుకున్నారు. గతేడాది కరోనా కారణంగా ఈ యాత్ర రద్దు చేశారు. అంకుష్ పండిత అనే వ్యక్తి ఐదోసారి ప్రయాణానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. భోలేనాథ్ దయతోనే ఈ ప్రయాణం సాధ్యమని ఆయన చెప్పారు. భగవంతుని దయ ఉన్నంతవరకు యాత్ర కొనసాగిస్తూ ఉంటానని ఆయన తెలిపారు. ఉజ్జ్వాల్ శర్మ తన 19 వ పర్యటనకు సిద్ధమవుతుండటం విశేషం.
షోఫియాన్లో ఎన్కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం
ఆర్మీ బలోపేతం వెనుక జనరల్ మానెక్షా అవిరళ కృషి.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..