దుబాయ్: ఐపీఎల్లో మరోమారు కరోనా వైరస్ కలకలం రేపింది. సన్రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్బౌలర్ నటరాజన్ వైరస్ బారిన పడ్డాడు. ఈ ఉదయం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో నటరాజన్కు పాజిటివ్ అని తేలింది. దీంతో ఒక్కసారిగా హైదరాబాద్ శిబిరంలో ఆందోళన నెలకొంది. ఈ తమిళనాడు బౌలర్తో సన్నిహితంగా మెలిగిన ఆల్రౌండర్ విజయ్ శంకర్, విజయ్ కుమార్(టీమ్ మేనేజర్), శ్యామ్ సుందర్(ఫిజియోథెరపిస్టు), అంజన(డాక్టర్), తుషార్ ఖేడ్కర్(లాజిస్టిక్స్ మేనేజర్), పెరియాస్వామి గణేశన్(నెట్బౌలర్) ఐసోలేషన్లోకి వెళ్లారు. అయితే నటరాజన్కు వైరస్ లక్షణాలు అంతగా లేకున్నా..ఐపీఎల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్(ఎస్వోపీ) ప్రకారం పదిరోజుల పాటు ఐసోలేషన్లో ఉండాల్సిన పరిస్థితి.