హైదరాబాద్, ఆట ప్రతినిధి: కరోనా సోకి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆసియా పవర్లిఫ్టింగ్ మాజీ చాంపియన్ జోసఫ్ జేమ్స్కు కేంద్ర క్రీడాశాఖ రూ.2.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. హైదరాబాద్కు చెందిన 55 ఏండ్ల జేమ్స్ కరోనాతో పోరాడుతున్న విషయం తెలుసుకున్న హెచ్ఎఫ్ఐ చీఫ్ జగన్మోహన్రావు ఈ అంశాన్ని కేంద్ర క్రీడాశాఖ, ఐవోఏ, సాయ్ దృష్టికి తీసుకెళ్లారు. అతని పరిస్థితిని వారికి తెలియజేసి ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేశారు. ఎవరైనా ఆర్థిక సమస్యల్లో ఉంటే వెంటనే తమను సంప్రదించాలని జగన్మోహన్రావు తెలిపారు. కరోనాతో ఇబ్బందుల్లో ఉన్న తాజా, మాజీ ప్లేయర్లను ఆదుకునేందుకు క్రీడాశాఖ, ఐవోఏ, సాయ్..తెలంగాణ నుంచి పుల్లెల గోపీచంద్, జగన్మోహన్రావును ప్రత్యేక ప్రతినిధులుగా నియమించిన సంగతి తెలిసిందే.