న్యూఢిల్లీ: టోక్యో పారాలింపిక్స్ హై జంప్లో రజత పతకం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన అథ్లెట్ మరియప్పన్ తంగవేలును కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ శనివారం ఘనంగా సన్మానించారు. రియో (2016) ఒలింపిక్స్ హై జంప్ టీ42లో స్వర్ణం నెగ్గిన తంగవేలు.. టోక్యోలో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగి రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ‘ఒలింపిక్స్లో వరుస పతకాలతో మరియప్పన్ దేశాన్ని గర్వపడేలా చేశాడు. టోక్యో క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత పారా అథ్లెట్లందరికీ ఇవే నా అభినందనలు’ అని ఠాకూర్ తెలిపారు.