సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి
హైదరాబాద్, ఆట ప్రతినిధి: క్రీడారంగంలో తెలంగాణను దేశానికే దిక్సూచిలా తయారు చేసేందుకు ప్రణాళిక బద్ధంగా పనిచేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా కృషి చేస్తున్నామని సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. గజ్వేల్ కేంద్రంగా 15 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ విలేజ్ నిర్మిస్తే జిల్లాలో ప్రతిభ కల్గిన క్రీడాకారులకు మేలు కల్గుతుందని ఆర్థిక మంత్రి హరీశ్రావు సూచించారని సాట్స్ చైర్మన్ పేర్కొన్నారు. గజ్వేల్ను స్పోర్ట్స్ హబ్గా మార్చే క్రమంలో ఫుట్బాల్ అకాడమీతో పాటు సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్, వివిధ క్రీడా సౌక ర్యాలతో ఇండోర్స్టేడియం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.