హైదరాబాద్, ఆట ప్రతినిధి: టోక్యో ఒలింపిక్స్లో షూటింగ్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్తో పాటు వివిధ క్రీడాంశాల నుంచి ప్లేయర్లు ప్రాతినిధ్యం వహించేలా కృషి చేసిన క్రీడా సంఘాలకు భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) ప్రత్యేక గ్రాంట్ అందించింది. ఒక్కో క్రీడా సంఘానికి రూ.25 లక్షల చొప్పున చెక్కులు ప్రదానం చేసింది. జాతీయ హ్యాండ్బాల్ సంఘం(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాసంఘాల ప్రతినిధులకు చెక్కులు అందించారు. జగన్ మాట్లాడుతూ ‘దేశంలో క్రీడారంగం మరింత అభివృద్ధి చెందాలంటే సంఘాలు ఇంకా బలోపేతం కావాలి. ఇందుకోసం ఐవోఏ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నది. టోక్యో విజయాల స్ఫూర్తితో పారిస్(2024) ఒలింపిక్స్ కోసం పనిచేయాలి’ అని అన్నారు.