భోపాల్ : కఠిన చట్టాలు తీసుకువచ్చినా మహిళలు, చిన్నారులపై లైంగిక దాడి ఘటనలకు బ్రేక్ పడటం లేదు. ఆరేండ్ల బాలికను గదిలో బంధించి స్వయానా తాత, మేనమామ లైంగిక దాడి కి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో వెలుగుచూసింది. బాలిక సోదరుడి ముందే వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఎనిమిది రోజుల కిందట జరిగిన ఈ ఘోరం గురువారం సాయంత్రం వెల్లడైంది. బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లి ప్రశ్నించడంతో జరిగిన విషయం బాధితురాలు వివరించింది.
ఆపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై కేసు నమోదైంది. కొద్దిరోజుల కిందట తన మేనమామ సమోసాలు ఇస్తానని తనను, తన సోదరుడిని బంధువుల ఇంటికి తీసుకువెళ్లాడని, అక్కడ అప్పటికే తాత ఉన్నాడని బాధితురాలు పేర్కొంది. వారు సోదరుడి ఎదుటే తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో తెలిపింది. నిందితులు బాలికకు రూ 20 ఇచ్చి ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని కోరారని పోలీసులు తెలిపారు