జొహన్నెస్బర్గ్: ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటిన దక్షిణాఫ్రికా రెండో టీ20లో పాకిస్థాన్ను చిత్తుచేసింది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా సోమవారం ఇక్కడ జరిగిన రెండో మ్యాచ్లో సఫారీ జట్టు 6 వికెట్ల తేడాతో ఆరు ఓవర్లు మిగిల్చి పాక్ను ఓడించింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (50) మినహా మిగిలిన వారు ఆకట్టుకోలేకపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 9 వికెట్లకు 140 పరుగులకే పరిమితమైంది. సఫారీ బౌలర్లలో జార్జ్ లిండే, లిజార్డ్ విలియమ్స్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఓపెనర్ ఐడెన్ మార్క్మ్ (54), క్లాసెన్ (36 నాటౌట్) దూకుడుగా ఆడడంతో 14 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా 141 పరుగులు చేసింది.