న్యూఢిల్లీ : మూడవ దశ కరోనా వైరస్ నిరోధక టీకాలు ఇచ్చే విషయమై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. వచ్చే నెల నుంచి 18 ఏండ్ల వయసు పైబడిన వారందరికీ టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో టీకా డ్రైవ్ మూడవ దశను క్రమపద్ధతిలో అమలు చేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం మార్గదర్శకాలను విడుదల చేసింది.
అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ అదనపు ప్రధాన కార్యదర్శులు / ప్రధాన కార్యదర్శులు, యూటీలకు ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆదివారం లేఖ రాశారు. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు గల పౌరులను టీకా ఇప్పించే జాబితాలో చేర్చడంతో అర్హత కలిగిన లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. దీని దృష్ట్యా ప్రైవేటు రంగ టీకా కేంద్రంలో టీకాలు వేయడం, అర్హతగల పౌరులు టీకా సేవలను సజావుగా, సౌకర్యవంతంగా పొందగలిగేలా రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ముందుగానే అవసరమైన సన్నాహాలు చేసుకోవాలి అని లేఖలో తెలిపారు.
“అర్హత కలిగిన లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నందున టీకా కేంద్రాల వద్ద రద్దీ ఎక్కువ ఉండకుండా చూసుకోవాలని, శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా తగిన ఏర్పాటు చేసుకోవాలి” అని లేఖలో పేర్కొన్నారు.
“టీకా మోతాదులతో సంబంధం లేకుండా, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ టీకా కేంద్రాలు కోవిన్ వ్యవస్థలో నమోదు చేసుకోవడం తప్పనిసరి. అన్ని సీవీసీలు అన్ని టీకాలను రికార్డ్ చేయడం, డిజిటల్ టీకా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం, అన్ని ఏఈఎఫ్ఐ లను నివేదించడం తప్పనిసరి అని కేంద్రం తెలిపింది.
సీవీసీగా నమోదు చేసుకోవడానికి ఆరోగ్య కేంద్రాలు తగినంత కోల్డ్ చైన్ పరికరాలు, సామర్థ్యం కలిగి ఉండాలి. వెయిటింగ్ ఏరియా, అబ్జర్వేషన్ పోస్ట్ టీకా కోసం తగినంత ప్రదేశం, తగినంత సంఖ్యలో టీకాలను ప్రిజర్వ్ చేసే సామర్థ్యం కలిగి ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నారు.
హిమాచల్లో ఏప్రిల్ 27 నుంచి 4 జిల్లాల్లో కర్ఫ్యూ
ఫ్లోరిడాలో బేబీ డైనోసార్ .. కెమెరాకు చిక్కిందంటున్న ఓ మహిళ.. వీడియో
ఘజియాబాద్లో సిక్కుల ‘ఆక్సిజన్ లాంగర్’
ఆఫ్ఘాన్ ఆర్మీ పోస్టుపై దాడి.. ఐదుగురు తాలిబాన్ ఉగ్రవాదులు హతం
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
దేశంలోనే ఎత్తైన క్రికెట్ స్టేడియం ఎక్కడంటే..?
విద్యావంతులైన మధ్యతరగతి వారి నిర్లక్ష్యం వల్లే సెకండ్ వేవ్: డాక్టర్ కటోచ్
రంగురంగుల్లో టీవీ ప్రసారాలు.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..