న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 10 గ్రాముల 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.61 పెరిగి రూ.44,364కు చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.44,303 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరుగడమే ఇవాళ దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరుగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక దేశీయంగా కిలో వెండి ధర ఇవాళ రూ.162 పెరిగి రూ.66,338కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.66,176 వద్ద ముగిసింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లలో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,726 అమెరికన్ డాలర్లు పలికింది. అదేవిధంగా ఔన్స్ వెండి ధర 25.95 అమెరికన్ డాలర్ల వద్ద స్థిరపడింది.