జిల్లా ఎస్పీ రాహుల్హెగ్డే
ఎములాడలో చిరంజీవి ట్రస్టు ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభం
వేములవాడ, మే27: కరోనా విపత్కర పరిస్థితుల్లో నటుడు చిరంజీవి ట్రస్టు ద్వారా ఆక్సిజన్ అందించి ప్రాణదాతగా నిలవడం అభినందనీయమని ఎస్పీ రాహుల్హెగ్డే కొనియాడారు. వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరి మున్నూరుకాపు నిత్యాన్నదాన సత్రంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్టు అక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయగా, ఆయన ముఖ్య అతిథిగా వచ్చి గురువారం ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రక్తదానంతో ఇప్పటికే ప్రజలకు సేవచేస్తున్న చిరంజీవి ఇప్పుడు ఆక్సిజన్ బ్యాంకుతో అండగా నిలబడడం చాలా గొప్ప విషయమన్నారు. అనంతరం రాష్ట్ర మున్నూరుకాపు పటేల్సంఘం అధ్యక్షులు కొండ దేవయ్య, ఆక్సిజన్ బ్యాంకు జిల్లా ఇన్చార్జి అరుణ్తేజచారి మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానతోపాటు ప్రజలకు అత్యవసర సమయాల్లో స్వచ్ఛందంగా ఆక్సిజన్ సిలిండర్లు అందజేస్తామని చెప్పారు. డాక్టర్ నిర్ధారించిన పత్రంతో పాటు వ్యాధి నిర్ధారణ పత్రాన్ని అందజేస్తే సిలిండర్లు ఇస్తామని చెప్పారు. రాజన్న సిరిసిల్లజిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానలకు వైద్యుల సూచనల మేరకు ఉచితంగా సిలిండర్లను అందజేస్తామని చెప్పారు. వంద ఆక్సిజన్ సిలిండర్లతోపాటు ఆక్సిజన్ అందించే యంత్రాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే వేములవాడలో మొదటిసారిగా చిరంజీవి ట్రస్టు ద్వారా మొట్టమొదటి ఆక్సిజన్ బ్యాంకు ప్రారంభమైందని వివరించారు.
కొండదేవయ్యకు మెగాస్టార్ ఫోన్
l ఏ ఒక్కరికీ ప్రాణ నష్టం జరగకుండా చూడాలని సూచన
ప్రాణవాయువు అందక ఏ ఒక్కరికీ ప్రాణ నష్టం జరగకుండా చూడాలని మెగాస్టార్ చిరంజీవి కొండదేవయ్యకు ఫోన్ ద్వారా వివరించారు. ప్రజలకు పూర్తిస్థాయి సేవలు అందేలా అందుబాటులో ఉండి ప్రాణవాయువును అందించాలని చె ప్పారు. కార్యక్రమంలో వేములవాడ డీఎస్పీ చం ద్రకాంత్, పట్టణ సీఐ వెంకటేశ్, మున్నూరుకాపు పటేల్సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, జిల్లా ఇన్చార్జి అరుణ్తేజచారి, చిరంజీవి అభిమానులు జితేందర్ వర్మ, మారం ప్రవీణ్, పవన్కల్యాణ్ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు బొజ్జ సుకుమార్, కౌన్సిలర్లు మారం కుమార్, రేగుల సంతోష్బాబు, బింగి మహేశ్ ఉన్నారు.