మంచిర్యాల ఏసీసీ, ఏప్రిల్ 7 : కొవిడ్-19 వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రజలు, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీలో గల మంచిర్యాల క్లబ్లో వంద పడకలతో ఏర్పాటు చేస్తున్న ఐసొలేషన్ కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి నీరజతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
బెల్లంపల్లిటౌన్, ఏప్రిల్ 7 : బెల్లంపల్లి సింగరేణి ఏరియా దవాఖానలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాన్ని కలెక్టర్ భారతీ హోళికేరీ పరిశీలించారు. వసతులపై కొవిడ్-19 బాధితులను అడిగి తెలుసుకున్నారు. లిక్విడ్ ఆక్సిజన్ సిస్టమ్ను ఏర్పాటు చేసేందుకు సింగరేణి సీఅండ్ఎండీ శ్రీధర్తో మాట్లాడుతానని పేర్కొన్నారు.
రెండో డోస్ వ్యాక్సిన్ వేసుకున్న ఎమ్మెల్యే
మంచిర్యాల ఏసీసీ, ఏప్రిల్ 7 : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు బుధవారం రెండో డోస్ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, కౌన్సిలర్లు ఎస్ హరికృష్ణ, వైద్యులు అరవింద్, అనిల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1817 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 180 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని నోడల్ అధికారి బాలాజీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 887 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని వ్యాక్సినేషన్ అధికారి డాక్టర్ ఫయాజ్ ఖాన్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
నేటి నుంచి ఆ నగరాల్లో రాత్రి కర్ఫ్యూ.. ఎక్కడంటే?
ఆ రాష్ట్రంలో 80శాతం యూకే వేరియంట్ కేసులే : కేంద్రమంత్రి