హైదరాబాద్, ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ): రాష్ట్ర హైకోర్టులో ప్రాక్టీస్చేసే 27 మంది న్యాయవాదులకు సీనియర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ అధ్యక్షతన జరిగిన న్యాయమూర్తుల సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 15 నుంచి పదోన్నతులు అమల్లోకి వచ్చినట్టు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.పదోన్నతులు పొందినవారిలో గండ్ర మోహన్రావు, ఈ అజయ్రెడ్డి, వీఎస్ఆర్ ఆంజనేయులు, ఎస్ అశోక్ ఆనంద్కుమార్, యామర్తి చంద్రశేఖర్, బీ చంద్రసేన్రెడ్డి, సీ దామోదర్రెడ్డి, ఎస్ ద్వారకానాథ్, ఆలోరు గిరిధర్రావు, వీ హరిహరన్, ఆర్ఎన్ హేమేందర్నాథ్రెడ్డి, ఎర్రవెల్లి మదన్మోహన్, రేసు మహేందర్రెడ్డి, చెరుకూరి మస్తాన్ నాయుడు, మహమ్మద్ ఇమ్రాన్ఖాన్, ఎస్ నంద, వేములపాటి పట్టాభి, టీ ప్రత్యుమ్నకుమార్రెడ్డి, కే రమాకాంత్రెడ్డి, వీ రవికిరణ్రావు, జంధ్యాల రవిశంకర్, కేవీ సింహాంద్రి, ఎస్ శ్రీనివాస్రెడ్డి, వేదుల శ్రీనివాస్, ఎన్ వాసుదేవరెడ్డి, పీబీ విజయ్కుమార్, కే వివేక్రెడ్డి ఉన్నారు.