పంచకుల: జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో తెలంగాణ ఆటగాడు ఫిడెల్ రఫీక్ స్నేహిత్ కాంస్య పతకంతో అదరగొట్టాడు. టోర్నీ సెమీఫైనల్ వరకు చేరిన స్నేహిత్ గురువారం ఇక్కడ జరిగిన సెమీస్లో సీనియర్ ఆటగాడు జి సాతియాన్ చేతిలో 0-4 (11-13, 5-11, 9-11, 5-11) తేడాతో పరాజయం చెందాడు. క్వార్టర్స్లో సుష్మిత్ రామ్పై ఏకపక్ష విజయం సాధించిన స్నేహిత్కు సెమీస్లో స్టార్ ఆటగాడి చేతిలో చుక్కెదురైంది. మరోవైపు టోర్నీ చాంపియన్గా జి సాతియాన్ నిలిచాడు. ఫైనల్లో సాతియాన్ (4-2) 11-6, 11-7, 10-12, 7-11, 11-8, 11-8 తేడాతో సీనియర్ శరత్ కమల్పై గెలిచి, స్వర్ణం కైవసం చేసుకున్నాడు.