చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా చెపాక్ మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతోన్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్ పృథ్వీ షా(53: 39 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్) అర్ధశతకానికి తోడు రిషబ్ పంత్(37: 27 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్) రాణించడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేసింది. మరో ఓపెనర్ శిఖర్ ధావన్(28) స్వేచ్ఛగా ఆడలేకపోయాడు.
చివర్లో స్టీవ్ స్మిత్(34 నాటౌట్: 25 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్) విజృంభించడంతో ఆ జట్టు 150 మార్క్ దాటింది. సన్రైజర్స్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్(2/31) ఒక్కడే రెండు వికెట్లు తీశాడు. జగదీశ సుచిత్ నాలుగు ఓవర్లు వేసి 21 పరుగులే ఇచ్చాడు. విజయ్ శంకర్(0/19) సైతం ఢిల్లీ బ్యాట్స్మెన్ను కట్టడి చేశాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీకి శుభారంభం లభించింది. ఓపెనర్లు పృథ్వీ షా దూకుడుగా ఆడటంతో పవర్ప్లే ఆఖరికి ఢిల్లీ 51/0తో నిలిచింది. యువ బ్యాట్స్మన్ షా ధనాధన్ 35 బంతుల్లోనే 7ఫోర్లు, సిక్స్ సాయంతో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. రషీద్ ఖాన్ వేసిన 11వ ఓవర్లో ధావన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో తొలి వికెట్కు 81 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కొద్దిసేపటికే షా రనౌటై వెనుదిరగడంతో ఢిల్లీ స్కోరు వేగం తగ్గింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పంత్, స్మిత్ నిలబడటంతో ఢిల్లీ ఆ మాత్రం స్కోరైనా చేసింది.