దుబాయ్: భారత యువ బాక్సర్ల అద్భుత ప్రదర్శనతో ఆసియా యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో దేశానికి పతకాల పంట పండుతున్నది. ఇప్పటికే ముగిసిన బౌట్లలో పలువురు బాక్సర్లు ఫైనల్స్కు చేరగా తాజాగా మరో ఆరుగురు ఆటగాళ్లు తుదిపోరుకు సిద్ధమయ్యారు. బుధవారం జరిగిన సెమీస్ బౌట్లలో నెగ్గి ఇద్దరు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు ఫైనల్స్ బరిలో నిలిచారు. మహిళల విభాగంలో సిమ్రాన్ (52 కిలోలు), స్నేహ (66 కిలోలు), ప్రీతి (57 కిలోలు), ప్రీతి (60 కిలోలు) తమ ప్రత్యర్థుల మీద గెలిచారు. పురుషుల జాబితాలో వంశజ్ (64 కిలోలు), విశాల్ (80 కిలోలు) విజయాలు సాధించారు.