టోక్యో: పారాలింపిక్స్( Tokyo Paralympics )లో మన అథ్లెట్లు దూసుకెళ్తున్నారు. సోమవారం ఒక్కరోజే ఐదు మెడల్స్ గెలవగా.. మంగళవారం షూటింగ్లో మరో మెడల్ ఇండియా ఖాతాలో చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్హెచ్1 ఈవెంట్లో సింఘ్రాజ్ అధానా బ్రాంజ్ మెడల్ గెలిచాడు. ఫైనల్లో అతడు 216.8 పాయింట్లు సాధించాడు. దీంతో భారత్ ఇప్పటి వరకూ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 8కి చేరింది. ఇందులో రెండు గోల్డ్, నాలుగు సిల్వర్, మరో రెండు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.