టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచాక సుదీర్ఘ విరామం అనంతరం బరిలోకి దిగిన తొలి టోర్నీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. మరో టోర్నీకి సిద్ధమైంది. నేటి నుంచి పారిస్ వేదికగా జరుగనున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750లో సింధు బరిలోకి దిగనుంది. మూడో సీడ్గా బరిలోకి దిగనున్న సింధు తొలి రౌండ్లో జాకబ్సన్ (డెన్మార్క్)తో తలపడనుంది. సింధుతో పాటు మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్ పోటీ పడుతుండగా.. పురుషుల విభాగంలో శ్రీకాంత్, సాయిప్రణీత్ బరిలో ఉన్నారు.