సెమీస్లో శ్రీకాంత్, సాత్విక్ జోడీ ఓటమి
బాసెల్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. స్విస్ ఓపెన్ టోర్నీ ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్లో ప్రపంచ చాంపియన్ సింధు 22-20, 21-10 తేడాతో నాలుగో సీడ్ మియా బ్లిచ్ఫెల్ట్ (డెన్మార్క్)ను 43 నిమిషాల్లోనే చిత్తుచేసింది. టైటిల్ కోసం రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్తో తెలుగమ్మాయి ఆదివారం తలపడనుంది. 2019లో ప్రపంచ చాంపియన్గా అవతరించిన తర్వాత ఓ టోర్నీ ఫైనల్ చేరడం సింధుకు ఇదే తొలిసారి.
కాగా పురుషుల సింగిల్స్ సెమీస్లో భారత స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ 13-21, 19-21 తేడాతో టాప్ సీడ్ విక్టర్ అక్సెల్సెన్ చేతిలో ఓడి, టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
పురుషుల డబుల్స్లో మంచి ఫామ్లో ఉన్న భారత ద్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్శెట్టి సెమీస్లో 10-21,
17-21 తేడాతో ఆరో సీడ్ డెన్మార్క్ ద్వయం కిమ్ అస్ట్రప్ – ఆండెర్స్ చేతిలో పరాజయం చెందారు.