హైదరాబాద్, ఆట ప్రతినిధి: పంజాబ్ వేదికగా జరుగుతున్న జాతీయ ఫెడరేషన్కప్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్ప్రింటర్ జివాంజీ దీప్తి రజత పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన బాలికల జూనియర్ 200 మీటర్ల ఫైనల్ రేసును దీప్తి 24.40 సెకన్లలో ముగించి వెండి పతకాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రియా మోహన్ (23.96సె, కర్ణాటక), అవంతిక (మహారాష్ట్ర, 24.46) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు.