హైదరాబాద్, ఆట ప్రతినిధి: పోలాండ్ ఓపెన్లో రాష్ట్ర యువ షట్ల ర్ కుదరవల్లి కృష్ణప్రియ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగి న మహిళల క్వార్టర్స్లో కృష్ణప్రియ 21-14, 21-13 తేడాతో సిమోనా పిల్గార్డ్ (డెన్మార్క్)పై అలవోక విజయం సాధించింది. 25 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్లో తెలుగు షట్లర్ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కండ్లు చెదిరే స్మాష్లకు తోడు నెట్, డ్రాప్ షాట్లతో వరుస గేమ్ల్లో మట్టికరిపించి టోర్నీలో ముందంజ వేసింది. సెమీస్లో క్రిస్టినాతో కృష్ణప్రియ తలపడనుంది.