లండన్: టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ రెండు నెలల పాటు ఆటకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ సందర్భంగా గాయపడ్డ గిల్.. ఇంగ్లండ్తో తొలి మూడు టెస్టులకు అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ అధికారి తెలిపారు. గిల్ కోలుకునేందుకు రెండు నెలల సమయం పట్టొచ్చని ఆయన అన్నారు. ప్రస్తుతం రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ రూపంలో భారత జట్టులో ముగ్గురు ఓపెనర్లు ఉండగా.. స్టాండ్బైగా ఎంపిక చేసిన వారిలో అభిమన్యు ఈశ్వరన్ అందుబాటులో ఉన్నాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానుంది.