జోగులాంబ గద్వాల : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద నిలకడగా కొనసాగుతున్నది. గురువారం 7,355 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 8,917 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. పవర్హౌస్కు 6,718 క్యూసెక్కులు, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-1కు 650 క్యూసెక్కులు, కోయిల్సాగర్ లిఫ్ట్నకు 315 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 45 క్యూసెక్కులు, కుడి కాలువకు 178 క్యూసెక్కులు, సమాంతర కాలువకు 150 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా 111 క్యూసెక్కులు ఆవిరిగా నమోదైంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా 7.991 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
పల్లె ప్రగతిలో అందరు భాగస్వాములు కావాలి
జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలి
రాగల మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు
టీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు : ఎంపీ బీబీ పాటిల్
అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
సింగరేణి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి