శుభ్మన్ గిల్ అర్ధ సెంచరీ.. భారత్ 70/1

బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో ఆసీస్ భారత్ ముందు 328 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన విషయం విదితమే. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా నాలుగో రోజు కేవలం రెండే ఓవర్లు ఆడింది. ఇక మంగళవారం ఆట ప్రారంభమైన కొద్ది సేపటికి రోహిత్ శర్మ (7) కమ్మిన్స్ బౌలింగ్లో పైన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఇక ఈ సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న శుభ్మన్ గిల్ కెరీర్లో రెండో అర్ధ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 104 బంతుల్లో 5 ఫోర్స్ సాయంతో 55 పరుగులు చేశాడు. ఇక క్రీజులో గిల్తో పాటు పుజారా(8) ఉన్నారు. ఈ రోజు భారత్ 66 ఓవర్స్ ఆడాల్సి ఉండగా, నిర్ణీత ఓవర్స్లో లక్ష్యాన్ని చేదిస్తారా, లేక మ్యాచ్ ను డ్రాగా ముగిస్తారా అన్నది చూడాలి. కాగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 369 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్లో 294 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్ లో 336 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది.
తాజావార్తలు
- పవర్ ఫుల్ ఉమెన్స్తో వకీల్ సాబ్.. పోస్టర్ వైరల్
- భారత్కు ఎగువన బ్రహ్మపుత్రపై డ్యామ్స్.. చైనా గ్రీన్సిగ్నల్
- మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి
- మెన్స్ డేను కూడా సెలబ్రేట్ చేయాలి : ఎంపీ సోనాల్
- ఉమెన్స్ డే స్పెషల్: విరాట పర్వం నుండి అమెజింగ్ వీడియో
- మునగాలలో అదుపుతప్పి బోల్తాపడ్డ కారు.. మహిళ మృతి
- రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు: మహేష్
- వరుసగా మూడో రోజూ 18 వేల కరోనా కేసులు
- రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా మల్లికార్జున్ ఖర్గే