గురుగ్రామ్: తెలంగాణ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక జాతీయ హార్డ్ కోర్టు సీనియర్ టెన్నిస్ చాంపియన్షిప్ టైటిల్ చేజిక్కించుకుంది. హర్యానా వేదికగా జరిగిన టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆదివారం రెండో సీడ్ రష్మిక 6-2, 7-6 (7/2)తో టాప్ సీడ్ వైదేహీ చౌదరి (గుజరాత్)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో మహారాష్ట్రకు చెందిన అర్జున్ ఖడే 6-3, 6-4తో పృథ్వీ శేఖర్ (తమిళనాడు) పై గెలిచి టైటిల్ సొంతం చేసకున్నాడు.