టోక్యో: ఇండియన్ షూటర్లు మను బాకర్, రాహి సర్నోబత్ 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో తీవ్రంగా నిరాశపరిచారు. ఈ ఇద్దరూ ఫైనల్కు క్వాలిఫై కాలేకపోయారు. గురువారం జరిగిన క్వాలిఫికేషన్ ప్రిసిషన్ రౌండ్లో 292 స్కోరుతో 5వ స్థానంలో నిలిచి ఆశలు రేపిన మను.. ర్యాపిడ్ రౌండ్లో వెనుకబడి పోయింది. మూడు సిరీస్లు కలిపి (96, 97, 97) ఆమె 290 స్కోరు మాత్రమే చేయగలిగింది. దీంతో ఆమె మొత్తం స్కోరు 582కు పరిమితమైంది. రెండు క్వాలిఫికేషన్ రౌండ్లు (ప్రిసిషన్, ర్యాపిడ్) కలిపి ప్రస్తుతం ఆమె 11వ స్థానంలో ఉంది. అయితే ఫైనల్కు టాప్ 8 మాత్రమే క్వాలిఫై అవుతారు.
మరోవైపు ప్రిసిషన్ రౌండ్లోనే తీవ్రంగా నిరాశ పరిచిన రాహి సర్నోబత్ మొత్తం 573 స్కోరుతో ఏకంగా 32వ స్థానంలో నిలిచింది. గురువారం ప్రిసిషన్లో 287, శుక్రవారం ర్యాపిడ్ రౌండ్లో 286 స్కోరు మాత్రమే చేయగలిగింది. మను బాకర్ పాల్గొన్న మూడు ఈవెంట్లలోనూ ఉత్త చేతులతోనే ఇంటిదారి పట్టింది.