న్యూఢిల్లీ: టీమ్ఇండియాకు నాయకత్వం వహించే అవకాశం దక్కడాన్ని గౌరవంగా భావిస్తున్నానని ఓపెనింగ్ బ్యాట్స్మన్ శిఖర్ ధవన్ పేర్కొన్నాడు. కోహ్లీసేన ఇంగ్లండ్లో పర్యటిస్తుండగా.. శ్రీలంకతో వచ్చే నెలలో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్లకు ధవన్ కెప్టెన్గా ఎన్నికైన విషయం తెలిసిందే. ‘దేశానికి నాయకత్వం వహించడాన్ని గొప్పగా భావిస్తున్నా. వినయంగా బాధ్యతలు నిర్వర్తిస్తా. మీ అందరి శుభాకాంక్షలకు ధన్యవాదాలు’ అని ధవన్ శుక్రవారం ట్వీట్ చేశాడు. ఈ పర్యటనలో భారత జట్టు జూలై 13 నుంచి 25 మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.