అహ్మదాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ తక్కువ స్కోరుకే టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయింది. శిఖర్ ధావన్(6), స్టీవ్ స్మిత్(4), పృథ్వీ షా(21) స్వల్ప స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ బ్యాట్స్మెన్ స్వేచ్ఛగా పరుగులు రాకుండా అడ్డుకుంటున్నారు. ఆర్సీబీ బౌలర్లు దెబ్బకు పవర్ప్లే ఆఖరికి ఢిల్లీ 43/2తో నిలిచింది. 8 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. ప్రస్తుతం రిషబ్ పంత్(13), మార్కస్ స్టాయినీస్(2) క్రీజులో ఉన్నారు.