న్యూఢిల్లీ: టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధవన్, అయేషా ముఖర్జీ వైవాహిక జీవితానికి ఫుల్స్టాప్ పడింది. తమ ఎనిమిదేండ్ల అనుబంధానికి విడాకులతో ముగింపు పలికారు. ధవన్తో తాను విడిపోతున్నట్లు అయేషా..ఇన్స్టాగ్రామ్ వేదికగా తన బాధను సుదీర్ఘ వివరణతో పంచుకుంది. అయితే దీనిపై ధవన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. సన్నిహిత మిత్రుల ద్వారా పరిచయమైన ఆస్ట్రేలియాకు చెందిన అయేషాను 2012, అక్టోబర్ 30న శిఖర్ పెండ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి ఏడేండ్ల కొడుకు జోరావర్ ఉన్నాడు. ఈనెల 19 నుంచి ఐపీఎల్ మొదలవుతున్న నేపథ్యంలో వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు ధవన్ ఆటపై ప్రభావం చూపే అవకాశముంది.