ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా పరిస్థితి మరింత దిగజారుతున్నది. గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో గరిష్ఠంగా 5,185 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 21 మందికి డబుల్ మ్యుటేట్ స్ట్రెయిన్ వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో వీరిని కలిసిన వారందరిని గుర్తించి ఐసొలేషన్లో ఉంచినట్లు బృహన్ ముంబై కార్పొరేషన్ అదనపు కమిషనర్ సురేశ్ తెలిపారు.
కాగా, ముంబైలో కరోనా కేసుల మొత్తం సంఖ్య 3,74,611కు చేరింది. గత 24 గంటల్లో ఆరు మరణాలు నమోదయ్యాయి. దీంతో కరోనా మృతుల సంఖ్య 11,606కు పెరిగింది. బుధవారం 2,088 మంది కోలుకోవడంతో వారి సంఖ్య 3,31,322కు చేరినట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు మహారాష్ట్ర, గుజరాత్లో కరోనా పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న పది జిల్లాల్లో తొమ్మిది మహారాష్ట్రకు చెందినవేనని పేర్కొంది.