దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి
59 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
భూత్పూర్,జూన్ 16 : కరోనా సంక్షోభ సమయంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్ర జా సంక్షేమాన్ని మరవలేదని దేవరకద్ర ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అన్నాసాగర్ గ్రా మంలో 59మందికి రూ.29,24,000 వి లువైన సీఎం సహాయనిధి చెక్కులను అం దజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ కరోనాతో ప్రపంచమంతా విలవిలలాడుతున్నా ప్రజా సంక్షేమ పథకాల ను సజావుగా అమలు చేస్తున్న ఘనత ము ఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. రైతుబంధు, సీఎం రిలీఫ్ఫండ్, ఆసరా పెన్షన్లు సకాలంలో అందిస్తున్నారని వివరించారు. దేశంలో పకడ్బందీగా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆరేనని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీలు కదిరె శేఖర్రెడ్డి, నా గార్జునరెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, జెడ్పీటీసీలు ఇంద్రయ్యసాగర్, కృష్ణయ్య, సింగిల్విండో చైర్మన్ కదిరె అశోక్రెడ్డి, నాయకులు సత్యనారాయణ, అజీజ్, ఖాజా, కొండారెడ్డి, శి వరాములు, లక్ష్మీనర్సింహయాదవ్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సకాలంలో బిల్లులు చెల్లించాలి
భూత్పూర్, జూన్ 16 : గ్రామాల్లో చేపట్టిన పనులకు అధికారులు సకాలంలో బి ల్లులు చెల్లించాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు. బుధవారం అన్నాసాగర్లో పంచాయతీరాజ్ ఏఈలతో ప్రత్యేకంగా మాట్లాడారు. గ్రామాల్లో నిర్మించిన సీసీరోడ్లు, డ్రైనేజీలకు సంబంధించిన బిల్లులు చెల్లించడంలో జాప్యం చేయొద్దన్నారు. ఎక్కడైనా సమస్య ఉంటే తన దృ ష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో డీఈఈ రామకృష్ణ, ఏఈలు కురుమూర్తి, అభిషేక్, లక్ష్మణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.