న్యూఢిల్లీ: ప్రస్తుత టెస్టు జట్టులో శార్దూల్ ఠాకూర్ పేస్ ఆల్రౌండర్ పాత్ర పోషిస్తున్నాడని భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పేర్కొన్నాడు. వెన్ను నొప్పికి శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం సుదీర్ఘ పార్మాట్లో హార్దిక్ పాండ్యా సేవలు అందుబాటులో లేకపోగా.. ఆ స్థానాన్ని మరొకరితో భర్తీ చేయాల్సిందేనని బుధవారం అరుణ్ అన్నాడు. ‘శార్దూల్ ఆల్రౌండర్గా నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియాలో అతడు బంతితో, బ్యాట్తో చక్కటి ప్రదర్శన కనబర్చాడు. టాలెంట్ విషయంలో తిరుగులేని హార్దిక్ పాండ్యా గాయం కారణంగా బౌలింగ్కు దూరమవడంతో పేస్ ఆల్రౌండర్ అవసరం ఏర్పడింది’ అని అరుణ్ చెప్పాడు.