ఐపీఎల్లో పాల్గొన్న ఫాఫ్ డుప్లెసిస్ సహా 11 మంది దక్షిణాఫ్రికా ఆటగాళ్లు గురువారం విమానంలో స్వదేశానికి బయలుదేరారు. బంగ్లాదేశ్ ప్లేయర్లు షకీబల్ హసన్, ముస్త్తఫిజుర్ ఢాకాలో అడుగుపెట్టారు. మరోవైపు వార్నర్, కమిన్స్, స్టీవ్ స్మిత్ సహా 14 మంది ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, కామెంటేటర్లు మొత్తం 40 మందితో కూడిన ఆస్ట్రేలియా బృందం మాల్దీవులకు చేరింది. భారత్ నుంచి ఆసీస్కు విమాన ప్రయాణాలను అనుమతించే వరకు వారు అక్కడే ఉండనున్నారు.