ఇస్లామాబాద్: వచ్చే నెలలో జరగనున్న మిగిలిన పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) మ్యాచ్లకు స్టార్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది దూరమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా షాహిద్ అఫ్రిది లీగ్ నుంచి తప్పుకున్నట్లు పాకిస్థా్న్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. వచ్చే నెలలో అబుదాబిలో పీఎస్ఎల్ తిరిగి ప్రారంభంకానుంది. గత మార్చ్లో 20 మ్యాచ్లు జరిగిన తర్వాత వాయిదా పడింది.
ఆరు ఫ్రాంచైజీలలోని చాలా మంది ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కరోనా బారినపడటంతో లీగ్ను అర్ధంతరంగా వాయిదా వేశారు. అఫ్రిది ముల్తాన్ సుల్తాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తీవ్రమైన నడుము నొప్పి కారణంగా డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు షాహిద్ తెలిపాడు.