చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతోన్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వికెట్లు కోల్పోయింది. సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఓపెనర్ దేవదత్ పడిక్కల్ను భువనేశ్వర్ కుమార్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షాబాజ్ అహ్మద్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. నదీవ్ వేసిన ఏడో ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి వెనుదిరిగాడు. సన్రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పవర్ ప్లే ఆఖరికి బెంగళూరు 47/1తో నిలిచింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ స్కోరు బోర్డును ముందుండి నడిపిస్తున్నాడు. గ్లెన్ మాక్స్వెల్ ధాటిగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. 9 ఓవర్లకు బెంగళూరు 2 వికెట్లకు 58 పరుగులు చేసింది. కోహ్లీ(22), మాక్సీ(7) క్రీజులో ఉన్నారు.