న్యూఢిల్లీ: మహిళల బిగ్బాష్ లీగ్లో భారత స్టార్లు షెఫాలీ వర్మ, రాధా యాదవ్ అడుగుపెట్టనున్నారు. ఈ ఏడాది చివర్లో జరిగే లీగ్లో ఇద్దరూ సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడే అవకాశం ఉంది. సిడ్నీతో 17 ఏండ్ల సంచలనం షెఫాలీ ఒప్పందం ఇప్పటికే కుదిరిందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అలాగే వర్మ తండ్రి రాజీవ్ సైతం ఈ విషయాన్ని తెలిపారు. మరోవైపు లెగ్స్పిన్నర్ రాధతోనూ సిక్సర్స్ జట్టు చర్చలు జరుపుతున్నది. భారత సీనియర్లు హర్మన్ప్రీత్ కౌర్ , మంధాన , వేద కృష్ణమూర్తి ఇప్పటికే బిగ్బాష్లో ఉన్న సంగతి తెలిసిందే.