కరోనా విరామం కలిసొచ్చింది: సెరెనా

మెల్బోర్న్: కరోనా వైరస్ కారణంగా తనకు లాభమే జరిగిందని అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ పేర్కొంది. ఈ విరామం వల్ల తాను గాయం నుంచి పూర్తిగా కోలుకోగలిగానని వెల్లడించింది. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ రెండో రౌండ్ సందర్భంగా గాయపడ్డ సెరెనా ఆ తర్వాత ఏ టోర్నీలోనూ బరిలో దిగలేదు. ‘గాయం కారణంగా ప్రాక్టీస్ చేయలేదు. ఒకవేళ షెడ్యూల్ ప్రకారం టోర్నీలు జరిగుంటే నేను కచ్చితంగా ఆడలేకపోయేదానిని. సమయం కావాలనుకున్నా. అనుకోకుండా ఇలా కలిసొచ్చింది’అని సెరెనా పేర్కొంది. చాన్నాళ్ల తర్వాత తిరిగి మైదానంలోకి దిగిన సెరెనా సోమవారం ప్రాక్టీస్ మ్యాచ్లో 6-1, 6-4తో గారిలోవాపై నెగ్గింది. ఏడుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన సెరెనా ఎనిమిదోసారి టైటిల్ సాధించాలనే కృతనిశ్చయంతో బరిలో దిగనుంది. ఈ నెల 8 నుంచి ప్రతిష్ఠాత్మక గ్రాండ్స్లామ్ టోర్నీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
- నాలుగో టెస్ట్కూ అదే పిచ్ ఇవ్వండి
- ఆప్లో చేరిన అందగత్తె మాన్సీ సెహగల్
- తాటి ముంజ తిన్న రాహుల్ గాంధీ..
- కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు
- వెండితెరపై సందడి చేయనున్న బీజేపీ ఎమ్మేల్యే..!
- కేంద్రానికి తమిళ సంస్కృతిపై గౌరవం లేదు: రాహుల్గాంధీ
- ఎయిర్పోర్ట్ లాంజ్లో బైఠాయించిన చంద్రబాబు.. వీడియో
- అవును.. ఐపీఎల్కు మేం రెడీగా ఉన్నాం: అజారుద్దీన్
- ఆనంద్ దేవరకొండ మూడో సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది..!
- కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మంత్రి ఈటల