హనుమాన్ జయంతి సందర్భంగా వీహెచ్పీ, భజరంగ్దళ్లు మంగళవారం నగరంలో చేపట్టనున్న వీర హనుమాన్ విజయయాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల మధ్య శోభాయాత్ర పూర్తి చేయాలని, గౌలిగూడలోని రామమందిరం నుంచి తాడ్బన్ హనుమాన్ ఆలయం వరకు నిర్వహించే ఈ శోభాయాత్రలో 21 మంది మాత్రమే హాజరుకావాలని సూచించింది. ఈ సంఖ్య మించడానికి వీల్లేదని, ఒక బైక్పై ఒక్కరే ఉండాలి, శోభాయాత్రను పోలీసులు వీడియో తీసి తదుపరి విచారణ సమయంలో అందజేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.