న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ స్కోడా ఇండియా గురువారం కాంపాక్ట్ ఎస్యూవీ క్యాటగిరీలో ‘కుషాక్’ను ఆవిష్కరించింది. కానీ దీని ధరను వెల్లడించలేదు. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వగలదని భావిస్తున్న కుషాక్ తయారీ కోసం దాదాపు 95 శాతం మేరకు దేశీయ పరికరాలనే ఉపయోగిస్తుండటం విశేషం. 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో కుషాక్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్కోడా వెల్లడించింది.