Sports
- Jan 02, 2021 , 17:02:12
గంగూలీకి మూడు స్టెంట్లు.. మరో 48 గంటలు ఆసుపత్రిలోనే

కోల్కతా: బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి మొత్తం మూడు స్టెంట్లు వేయనున్నట్లు వుడ్ల్యాండ్స్ ఆసుపత్రి వెల్లడించింది. ఇప్పటికే యాంజియోప్లాస్టీ నిర్వహించి ఒక స్టెంట్ వేశామని, మరో రెండు ఆది, సోమవారాల్లో వేయాల్సి ఉన్నదని తెలిపింది. మరో 48 గంటల పాటు దాదా హాస్పిటల్లోనే ఉంటారని స్పష్టం చేసింది. గంగూలీ మెలుకవగానే ఉన్నారని, తన కూతురు సనాతోనూ మాట్లాడారని చెప్పింది. గంగూలీకి చికిత్స కోసం ముగ్గురు డాక్టర్లతో ఒక టీమ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. మొత్తంగా మరో వారం రోజుల పాటు గంగూలీకి చికిత్స కొనసాగుతుందనీ వుడ్ల్యాండ్స్ ఆసుపత్రి తమ ప్రెస్ రిలీజ్లో పేర్కొంది.
తాజావార్తలు
- ‘కొవిడ్ వ్యాక్సినేషన్ను పక్కాగా చేపట్టాలి’
- బీటీపీఎస్ 3వ యూనిట్ సింక్రనైజేషన్ సక్సెస్
- పండుగవేళ కేటీఆర్పై అభిమానం..
- టీఆర్పీ స్కాం: రిపబ్లిక్ టీవీ సీఈవో గోస్వామి జైలుకెళ్లాల్సిందే
- బాలుడికి లింగ మార్పిడి చేసి.. మూడేండ్లుగా లైంగికదాడి
- తక్కువ వడ్డీరేట్లు.. ఇంటి రుణానికి ఇదే సరైన టైం!
- అనుమానం వద్దు.. తొలి టీకా నేనే వేయించుకుంటా : మంత్రి ఈటల
- వన్యప్రాణి వధ.. ఇద్దరిపై కేసు నమోదు
- భారీ మొసలిని కాపాడిన వన్యప్రాణుల సంరక్షకులు
- మిలిటరీతో లింక్స్:జియోమీపై ట్రంప్ నిషేధం!
MOST READ
TRENDING