టోక్యో: ఇండియన్ షట్లర్లు సాత్విక్, చిరాగ్ మంగళవారం జరిగిన గ్రూప్ ఎ మ్యాచ్లో విజయం సాధించారు. బ్రిటన్కు చెందిన బెన్ లేన్, సీన్ వెండీలపై 21-17, 21-19 తేడాతో గెలిచారు. అయితే మరో మ్యాచ్ మిగిలి ఉన్నా క్వార్టర్ఫైనల్కు మాత్రం వీళ్లు క్వాలిఫై కాలేకపోయారు. మరో మ్యాచ్లో చైనీస్ తైపీ జోడీ లీ యాంగ్, వాంగ్ చిలిన్ జోడీ వరల్డ్ నంబర్ వన్ జోడీ మార్కస్ గిడియోన్, కెవిన్ సుకముల్జో జోడీపై గెలవడం సాత్విక్, చిరాగ్ అవకాశాలను దెబ్బతీసింది. సోమవారం జరిగిన తొలి మ్యాచ్లో ఇదే వరల్డ్ నంబర్ వన్ ఇండోనేషియా జోడీ మార్కస్ గిడియోన్, కెవిన్ సుకముల్జో చేతిలో 13-21, 12-21 తేడాతో సాత్విక్, చిరాగ్ ఓడిపోయిన విషయం తెలిసిందే.