ముంబై: రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు టాస్ వేసే సమయంలో చోటుచేసుకున్న సరదా సన్నివేశం ఇప్పుడు వైరల్గా మారింది.
పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్, రాయల్స్ సారథి సంజూ శాంసన్ టాస్ కోసం రిఫరీ, వ్యాఖ్యాతతో కలసి పిచ్ వద్దకు వచ్చారు. సంజూ టాస్ వేయగానే రాహుల్ టెయిల్స్ కోరుకున్నాడు. టాస్ గెలిచిన సంజూ బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ హెడ్స్ పడిందని రిఫరీ చెప్పి కాయిన్ తీసుకుందామనుకున్నాడు. ఈ లోపే సంజూ ఆ కాయిన్ తీసుకొని తన జేబులో వేసుకున్నాడు. టాస్ అనంతరం ఆ కాయిన్ను రిఫరీ మళ్లీ అడిగి తీసుకున్నాడు.
ఇదే విషయంపై శాంసన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తీసుకునే సమయంలో స్పందించాడు.
‘ఆ కాయిన్ చూడటానికి చాలా బాగుంది కాబట్టి నేను దాన్ని తీసుకొని జేబులో వేసుకున్నాను. నేను దీన్ని ఉంచుకోవచ్చా అని రిఫరీని అడిగానని కానీ, అలా కుదరదని చెప్పాడు’ అని సంజూ వివరించాడు. భారీ ఛేదనలో అద్భుత పోరాటం ప్రదర్శించిన శాంసన్(119: 63 బంతుల్లో 12 ఫోర్లు, 7సిక్సర్లు)కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఐపీఎల్ 2021 సీజన్లో సంజూ చేసిన సెంచరీయే మొదటిది కావడం విశేషం. 2017, 2019 సీజన్లలోనూ శతకాలు బాదిన శాంసన్కు ఇది మూడోది.