ఉఫా (రష్యా): ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో స్వర్ణ పతక ఆశలు రేపిన భారత ప్లేయర్లు ఫైనల్స్లో నిరాశపరిచారు. అద్భుత ప్రదర్శనతో ఫైనల్స్కు చేరిన సంజూ దేవి, భతేరి తుది పోరులో ఓడి రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. రష్యా వేదికగా ఉఫాలో శుక్రవారం జరిగిన 62 కిలోల విభాగం ఫైనల్స్లో పోటీ పడిన సంజూ దేవి.. రష్యా రెజ్లర్ అలినా కసబీవా చేతిలో ఓడిపోయింది. మరోవైపు 65 కిలోల కేటగిరీలో పోటీ పడిన భతేరి.. ఇటిన రింగసి (మాల్దోవా) చేతిలో ఓటమిపాలైంది. ఇదే టోర్నీ లో బిపాషా రజతం గెలవగా సిమ్రా న్, సిటో కాంస్యాలు నెగ్గిన విషయం తెలిసిందే.