రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు వెంట నడుస్తూ వెళ్తున్న మహిళా కూలీలను ఢీకొట్టింది.
ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్ర శివారులో మంగళవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.
కూలీ పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో వెనుక నుంచి మహిళను కారు ఢీకొంది. మృతులు నందిగామ మండల కేంద్రం సమీపంలోని తండాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ఘటనా స్థలం వద్ద పెద్దఎత్తున జనాలు గుమిగూడారు. మృతిచెందిన మహిళలు గిరిజనులని ప్రాథమిక సమాచారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి