మేడ్చల్: జిల్లాలోని జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. జవహర్నగర్లోని బీజేఆర్ నగర్లో ఉన్న ఓ ఇంట్లో వృద్ధుడు(65) విగత జీవిగా పడిఉన్నారు. ఆ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతడు రెండు, మూడు రోజుల క్రితం చనిపోయి ఉంటాడని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.