న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా క్లెవ్లాండ్ టోర్నీ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా-క్రిస్టినా మెక్హల్ (అమెరికా) జోడీ 6-3, 6-3తో లూసి హ్రాడెకా-షుయ్ జాంగ్ (చెక్ రిపబ్లిక్) జంటపై విజయం సాధించింది. గంటా ఒక నిమిషం పాటు ముగిసిన పోరులో సానియా జోడీ వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తుచేసింది. రెండు ఏస్లు సంధించిన సానియా జంట.. ఐదు బ్రేక్పాయింట్లు కాచుకొని.. ఓవరాల్గా 59 పాయింట్లతో ముందడుగు వేసింది.